03-06-2025 12:00:00 AM
దేశంలో పట్టణ వరదలు సంక్లిష్ట సమస్యగా మిగిలిపోయాయి. వీటి పరిష్కారాలపట్ల దీర్ఘకాలిక నిర్లక్ష్యం కనిపిస్తున్నది. పట్టణ వరదలను నివారించడానికి లేదా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాలు కూడా సాపేక్షంగా ఇటీవలి కాలంలోనే వచ్చాయి.
భారతదేశంలో పట్టణ వరదలను సమర్థవంతంగా ఎదు ర్కోవడానికి మెరుగైన డ్రైనేజీ తీరుతెన్నులు, ప్రణాళిక, ప్రకృతి ఆధారిత పరి ష్కారాలతో కూడిన బహుముఖ విధానం అవసరం. కేరళలో ఋతు పవనాలు ముందుగానే వచ్చిన కొద్దిసేపటికే భారతదేశం అంతటా అనేక పట్టణాలు, నగరాల్లో వరదల అల్లకల్లోలం వచ్చింది. మే 30న గౌహతిలో భారీ వర్షం కురిసింది. అక్కడి ప్రజల సాధారణ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
ఆ నగరంలో సగం మంది మునిగిపోయారని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది వర్షాకాలానికి కొన్నాళ్ల ముందుగానే వచ్చి పడ్డ భీకర వరదలు గౌహతి నగరం సహా అస్సాంలోని ఇతర ప్రాంతాలనూ అంధకారంలోకి నెట్టాయి. 100 కంటే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు మూసివేతకు గురయ్యాయి. సుమారు 9 లక్షల మందికి ఆ సమయాల్లో విద్యుత్ లేకుండా పోయిం ది.
వరదల బీభత్సం ఇంతటితో ఆగలేదు. మొత్తం మీద మే 30 కల్లా కనీసం 18 మంది మరణించారు. భారతదేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలను ఋతు పవనాలు ఉగ్రరూపంతో దండెత్తినంత పనిచేశాయి. తర్వాత మరో తొమ్మిది మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయ.
రికార్డులు బద్దలయ్యాయి!
మునుపటి కాలం వలె కాకుండా ఇటీవలి ఋతు పవనాల అల్లకల్లోలం భారత దేశంలోని పట్టణ ప్రాంతాలలో మరింత అధికమైంది. ప్రతి సంవత్సరం మరిన్ని ఎక్కువ సంఖ్యలో పట్టణాలు, నగరాలు ఆకస్మిక పట్టణ వరదలవల్ల కలిగే హఠాత్ వినాశనానికి గురవుతున్నాయి. ఋతు పవనాలు రాక ముందే, ఢిల్లీలో మే 25 తెల్లవారు జామున 81.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1901 తర్వాత మే నెలలో రాజధానిలో నమోదైన అత్యంత అధిక వర్షపాతం.
వరుణదేవుని ఉగ్రతను ఎదుర్కొన్న మహానగరాలలో ఢిల్లీ ఒక్కటే కాదు, మే 18న (ఋతు పవనాలకు ముం దే) ముంబైలోనూ భారీ వర్షాలు కురిశాయి. తర్వాత మే 24, 25, 26 తేదీలలో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఈ నగరంలో 26, 27 తేదీల్లో వరుసగా 135 మి.మీ, 164 మి.మీ వర్షం కురిసింది. ముంబైలో కుండపోత వర్షం చాలా తీవ్రప్రభావాన్ని చూపింది. వీధులు, రోడ్లను వరద ముంచెత్తడమే కాక కొత్తగా ప్రారంభమైన సొగసైన ముంబై మెట్రో లైన్- (ఆక్వా లైన్) కూడా మునిగిపోయింది. వర్షపు నీరు నెట్వర్క్లోని కొన్ని భాగాలను ముంచెత్తడం విషాదం.
ఆశ్చర్యకరంగా ఢిల్లీ మాదిరిగానే, ముం బైలోనూ మే నెలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. శాంటాక్రూజ్లో 324 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొలాబా 1918లో నమోదైన 279.4 మి.మీ. వర్షం మే నెల రికార్డును అధిగమించింది. ఋ తు పవనాలు రాకముందే, భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు వరదలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంది. వర్షాకాలం ముందు కురిసిన వ ర్షాలు నగరాన్ని ముంచెత్తాయి.
అనేక ని వాస స్థలాలు, రోడ్లను వరద నీరు ఆక్రమించడంతో ప్రజలను రక్షించడానికి పడ వలు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు. ఢి ల్లీ, ముంబై మాదిరిగానే బెంగళూరు కూ డా 2025 మే నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతాన్ని పొందింది. ఇది నగర చరిత్రలో అత్యంత అధిక స్థాయి వర్షంగా మా రింది.
నగరంలో ఇటీవల 307.9 మి.మీ వర్షపాతం నమోదవగా, ఇది 2023లో నమోదైన 305.4 మి.మీ. రికార్డును అధిగమించింది. బెంగళూరులో కనిపించిన దృశ్యాలు ఇటీవలి సంవత్సరాలలో -ముఖ్యం గా 2015, 2017, 2020, 2022, 2023లలో -తరచుగా నగరాన్ని తాకిన ప ట్టణ వరదలను మించి గుర్తుకు తెచ్చాయి.
ముందే వచ్చిన వరదలు
ఈ సంవత్సరం పట్టణ వరద అల్లకల్లోలం మునుపటి సంవత్సరాల మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, ముం దుగా వరదలు ఋతు పవనాల గరిష్ట కాలంలో లేదా ఋతు పవనాల తర్వాత సంభవించాయి. కానీ 2025లో వర్షాకా లం ముందు కురిసిన వర్షాలు వరదలు, విధ్వంసానికి దారితీయడం దయనీయం. చెట్లు కూలిపోవడం, గోడలు నేల మట్టమవడం, విద్యుదాఘాతాలు వంటి సంఘట నలలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగాయి.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గౌ హతిలలో ఇటీవల సంభవించిన పట్టణ వరదలకు ప్రధాన, తక్షణ కారణం కొన్ని గంటల్లో అకస్మాత్తుగా, అధిక స్థాయిలో ఎ డతెరిపి లేకుండా కురిసిన వర్షపాతం. కా నీ, ఈ సరళమైన సమాధానం లక్షణాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది. అయితే, నిజ మైన అనారోగ్యకర ప్రభావం మరింత తీ వ్రంగా ఉందనడంలో సందేహం లేదు. అ యితే, వరదలు పట్టణాలు, నగరాలను ఇం తలా ముంచెత్తిన వేళ సంభవించిన నష్టాలకు పలు రకాల కారణాలు ఉన్నాయి.
ఇంతగా వరదనీటిని తట్టుకొనే స్థాయిలో పట్టణాలు, నగరాల నిర్మాణ ప్రణాళికలు లేకపోవడం ప్రధాన కారణం. చాలా కాలంగా భారత్ వరద నియంత్రణ ప్రయత్నాలు నదీ వరదలపైనే దృష్టి సారించాయి. ఇవి ఎక్కువగా గ్రామీ ణ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. అక్కడ విధ్వంసం బాటను వదిలి వేస్తాయి.
పట్టణ వరదలు ఆర్థిక వృద్ధి కేంద్రాలు అయిన నగరాల్లో అపరిమిత విపత్తు జీవితానికి అంతరాయం కలిగించినప్పటికీ, ప్రభుత్వాలు (కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక సంస్థల) పట్టణ వరదల తీవ్రతను తగ్గించడానికి కారణాలను అధ్యయనం చేయడా నికి లేదా పరిష్కార చర్యలను ప్రతిపాదించడానికి తక్కువ ప్రయత్నం చేశాయి.
కొత్త ప్రణాళికలు అవసరం
భారతదేశంలో పట్టణ వరదలు నిజమైన అనాథ సమస్యగా మిగిలిపోయాయి. వీటి పరిష్కారాలపట్ల దీర్ఘకాలిక నిర్లక్ష్యం కనిపిస్తున్నది. పట్టణ వరదలను నివారించడానికి లేదా సమర్థవంతంగా ఎదుర్కోవ డానికి లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాలు కూడా సాపేక్షంగా ఇటీవలి కాలంలోనే వచ్చాయి.
సరళంగా చెప్పాలం టే పట్టణ వరదలు అంటే భారీ వర్షపా తం, పొంగి పొర్లుతున్న నదులు లేదా ఇ తర నీటి సంబంధిత సంఘటనల కారణం గా జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో భూ మి, ఆస్తి మునిగిపోవడం. ఇది తరచుగా పేలవమైన పారుదల, అభేద్యమైన ఉపరితలాల ద్వారా తీవ్రతరం అవుతుంది. ఈ సంక్షోభం నిజానికి గ్రామీణ వరదలకు భి న్నంగా ఉంటుంది.
అన్ని పరిస్థితులను దృ ష్టిలో పెట్టుకొని, ఇప్పటికైనా రాజకీయం గా, ప్రభుత్వాల పరంగా పట్టణాలు, నగరాలపైకి హఠాత్తుగా వచ్చిపడే వరద సంక్షో భం నుంచి గట్టెక్కించే మార్గాలను అన్వేషించాలి. చెరువులు, లోతట్టు ప్రాంతాలు కబ్జాలకు గురికాకుండా చూడాలి. పెద్ద ఎ త్తున వచ్చే వరద నీరుకు దారిచ్చే అవకా శం ఉంటేనే అత్యధిక మేర ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించకుండా జాగ్రత్త పడిన వాళ్లమవుతాం.
గడీల ఛత్రపతి