సిద్ధరామేశ్వర ఆలయంలో 24న హుండీ లెక్కింపు
23-03-2026 12:39 AM
భిక్కనూర్, మార్చి22(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా పేరొందిన ,ప్రసిద్ధ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం లో ఈ నెల 24న హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఈ ప్రక్రియను ఇన్స్పెక్టర్ కమల, సహాయ కమిషనర్ విజయ రామారావు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. హుండీ ఆదాయాన్ని పారదర్శకంగా లెక్కించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు భక్తులు, సేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.




