06-06-2025 01:30:25 AM
- చినరాయుని చెరువులో అక్రమ నిర్మాణాలు
- స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా
- సిబ్బందితో నిర్మాణదారుల వాగ్వాదం
మేడ్చల్, జూన్ 5 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్లోని చినరాయుని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది గురువారం కూల్చివేశారు. ఎఫ్టీఎల్లో భవనాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
దీంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మూడు భవనాలు నిర్మిస్తున్నట్టు నిర్ధారించారు. దీంతో గురువారం జేసీబీల సాయంతో, పోలీసుల భారీ బందోబస్తు మధ్య భవనాలను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా నిర్మాణదారు లకు, హైడ్రా సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ కూల్చివేతలు పూర్తి చేశారు.