27-05-2025 05:05:19 PM
శిథిలావస్థకు చేరిన మెట్లను తొలగించిన హైడ్రా
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫతేనగర్ వంతెన(Fatehnagar Bridge) మెట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) మంగళవారం ఉదయం పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న వంతెన మెట్లపై నుంచి దిగుతుండగా అవి విరిగిపడి ఇరువురిగి తీవ్ర గాయాలైన విషయం విధితమే. సోమవారం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో హైడ్రా కమిషనర్(Hydra Commissioner) మెట్ల మార్గాన్ని మంగళవారం పరిశీలించారు. ప్రతి ఆదివారం సనత్నగర్(Sanath Nagar)లో సంత జరుగుతుందని, ఆ సమయంలో వందలాది మంది మెట్ల మార్గాన్ని వినియోగిస్తారని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
శిథిలావస్థకు చేరుకున్న మెట్లపై నుంచి రాకపోకలు సాగించడం సరికాదని కమిషనర్ నిర్ధారించారు. వంతెనకు ఆనుకుని ఏర్పాటు చేసిన మెట్లను పూర్తిగా తొలగించాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాల విషయంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం(Civil Engineering Department) నిపుణులతో తనిఖీ చేయించి ప్రమాదకరంగా మారకముందే వాటిని తొలగించాలని ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. కమిషనర్ ఆదేశాలతో ఫతేనగర్ వంతెనకు ఆనుకుని నిర్మించిన మెట్ల మార్గాన్ని జేసీబీతో హైడ్రా డిజాస్టర్ సిబ్బంది మెట్లను తొలగించారు. కొత్తగా అక్కడ మెట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్గౌడ్(Fatehnagar Corporator Satish Goud) ఈ సందర్భంగా వెల్లడించారు.