31-05-2025 12:54:01 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, మే 30 (విజయ క్రాంతి): చివరి శ్వాస వరకు చొ ప్పదండి నియోజకవర్గం ప్రజల కు సేవ చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నా రు. శుక్రవారం గంగాధర మండ లంలోని 33 గ్రామాలకు చెందిన 721 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతితో కలిసి మంజూరి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్ర భుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క గంగాధర మండలంలోనే 721 మంది అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. 721 మందికే కాదు, చొప్పదండి నియోజకవర్గం లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తామన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేశారని అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరైనా మామూలు అడిగితే మా దృష్టికి తీసుకురండి, లేదా పోలీ స్ అధికారులకు ఫిర్యాదు చేయండి..
సంక్షేమ పథకాలు అందించడంలో అవినీతికి తావు లేద న్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిం చిందని, జ్యోతి పథకంతో 200 మీట్ల వరకు ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అందజే స్తుందన్నారు.
గంగాధర మండలంలో 2018 లో బిఆర్ఎస్ ప్రభుత్వం 2483 మంది రైతులకు రూ.17 కోట్ల 82 లక్షల రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5744 మంది రైతులకు రూ. 48 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నారా యణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ.43 కోట్లతో పూర్తి చేయ బోతున్నామన్నారు.
నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనుల ను పూర్తి చేసి కోనసీమగా మార్చుతామన్నారు. అతి త్వరలోనే గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.