calender_icon.png 19 June, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

31-05-2025 12:54:50 AM

కొత్తకోట మే 30 : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు చెన్నయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బిచుపల్లి యాదవ్ లు అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలం నాటేల్లి గ్రామంలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తిరుగుతూ తల్లితండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి మాట్లాడుతూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించి పాఠశాలలను పరిరక్షించాలని కోరారు. ఈ భాధ్యత మనందరిపై ఉందని,ప్రభుత్వ బ డుల్లో విద్యార్థులు సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.

ప్రభుత్వ స్కూలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారని, బడీ డు పిల్లలందరినీ ప్రభుత్వ స్కూల్లోనే చేర్పించాలని అన్నారు.అంతేకాకుండా ఎలాంటి సహాయసహకారాలైనా విద్యకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామాల్లో పాఠశాలలు పట్టుకొమ్మలని,మన ఊరు,మన బడిని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు, యండి వహీద్,మాజీ వార్డ్ సభ్యులు బోయ రాములు, పి,దశరథ, పి, బలరాం,ఎన్,రాజ్కుమార్,బోయ రాజు, యండి, మైన్నోద్ధిన్, జి,కృష్ణయ్య గౌడ్,బోయ వెంకటయ్య, పి,డైరెక్టర్ గొల్ల విష్ణు కుమార్, పి,సతీష్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.