31-05-2025 12:53:36 AM
మహబూబ్ నగర్ మే 30 (విజయ క్రాంతి) : పట్టణం లో కొలువైన రేణుకా ఎల్లమ్మ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.