18-12-2025 12:28:42 AM
కోదాడ డిసెంబర్ 17: న్యాయవాదుల సంక్షేమానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లయర్స్ కృషి చేస్తుందని ఆ సంఘ కేంద్ర కమిటీ సభ్యుడు ఓరుగంటి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల నరసింహారావులు తెలిపారు. బుధవారం కోదాడ పట్టణం కోర్టు ఆవరణలో ఐఏఎల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రస్తుతం న్యాయవాదులకు అందుతున్న నగదు రహిత వైద్య సేవలు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచి కుటుంబ సభ్యులందరికీ వర్తింపజేయాలని, మరణించిన న్యాయవాది కుటుంబానికి ప్రభుత్వం అందించే 10 లక్షల రూపాయల సహాయాన్ని 20 లక్షల రూపాయలకు పెంచడంతోపాటు సీనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.