17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐపై వేటు

18-12-2025 12:28 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్ల మాఫీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావుపై బదిలీ వేటు వేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సిబ్బందిని కూడా బదిలీ చేస్తూ  ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను క్లియర్ చేసేందుకు, పెండింగ్ చలాన్లను మాఫీ చేసేందుకు  సీఐ నర్సింగరావు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నట్లు సీపీకి ఫిర్యాదులు అందాయి.

దీంతో సీపీ తక్షణమే వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇన్‌స్పెక్టర్ నర్సింగరావుతో పాటు ఎస్‌ఐ అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్లను బదిలీ చేశారు. వీరిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు.పోలీస్ శాఖలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, జీరో టోలరెన్స్  పాటిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇటీవల అవినీతి ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లపై కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.