calender_icon.png 17 June, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ పాఠశాల... అదరహో!

17-06-2025 12:00:00 AM

  1. చదువు, ఇన్నోవేషన్లో చేవెళ్ల మోడల్ స్కూల్, కాలేజీ ముందంజ

రూ. కోటికి పైగా ఖర్చుతో అమెజాన్ సంస్థ రెనోవేషన్

40 రోజుల్లో డైనింగ్ హాల్, ల్యాబ్, ప్లేగ్రౌండ్ అభివృద్ధి

బిల్డింగ్లు, కాంపౌండ్ వాల్స్ కు ఆకట్టుకునే పెయింటింగ్స్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థిని శ్రుతిలయకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్

సైన్స్ ఫేర్లో స్టేట్ స్థాయికి ఎంపికై జపాన్ వెళ్లిన విద్యార్థి సర్బజిత్

చేవెళ్ల, జూన్ 16: చేవెళ్ల ఆదర్శ పాఠశాల, కాలేజీ.. పేరుకు తగ్గట్టుగానే అదరహో అనిపిస్తోంది. చదువుతో పాటు మౌలిక వసతు ల్లోనూ ఇతర స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోం ది. ఇక్కడి విద్యార్థులు స్టేట్ స్థాయి ర్యాంకు లు, కేంద్ర స్కాలర్షిప్లు సాధించడంతో పాటు ఇన్నోవేషన్ రంగంలో అంతర్జాతీయ స్థాయి లో రాణిస్తున్నారు. అమెజాన్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కిం ద కేవలం 40 రోజుల్లో స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దింది.

రూ. కోటికి పైగా ఖ ర్చుతో క్లాస్ రూముల రెనోవేషన్ తో పాటు 180 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ హాల్, సోలార్ పవర్ ప్లాంట్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసింది. సైంటిఫిక్ ఆలోచనలు, ప్రయోగాల కోసం ‘థింక్ బిగ్ ల్యాబ్’ స్థాపించడంతో పాటు లైబ్రరీని అభివృద్ధి చేసింది. ప్లేగ్రౌండ్ లో ఒక బాస్కె ట్బాల్, రెండు వాలీబాల్, రెండు ఖో-ఖో, ఒక షటిల్ కోర్టులు ఏర్పాటు చేసింది.

అంతేకా దు, స్కూల్ భవనాలు, ప్రహరీ, ఓపెన్ ఆడిటోరియానికి ఆకర్షణీయ పెయింటింగ్స్ వే యించింది.  ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ కోర్సులతో పాటు 100 (పోలీస్), 108 (అంబులెన్స్), 1098 (చై ల్ హెల్ప్లైన్), 1930 (సైబర్ క్రైమ్) నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పెయింటింగ్స్ వేయించడం విశేషం. ఈ సౌక ర్యాలన్నింటినీ ఐదు రోజుల క్రితం ఎమ్మెల్యే కాలె యాదయ్య అమెజాన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

772 మంది విద్యార్థులు

మోడల్ స్కూల్, కళాశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన జరుగుతోంది. 6 నుంచి 10వ తరగతి వరకు 504 మంది, ఇంటర్మీడియట్లో 268 మంది, మొత్తం 772 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి బోధించేందుకు ఒక ప్రిన్సిపల్, 17 మంది రెగ్యులర్ టీచర్లు, ముగ్గురు తాత్కాలిక టీచర్లు ఉన్నారు. విద్యార్థులు డే స్కాల ర్లుగా ఉండగా, ఇంటర్మీడియట్ అమ్మాయిలు.. 100 మందికి హాస్టల్ సౌకర్యం ఉం ది.

మిగిలిన విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద ‘అక్షయ పాత్ర’ ద్వారా ఆహారం అందిస్తున్నారు. రెగ్యులర్ కోర్సులతో పాటు ఐటీ, ఐఐటీ వంటి వృత్తి విద్యా కోర్సులు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అందుబాటులో ఉన్నాయి. ముగ్గురు శిక్షకు లు బోధిస్తున్న ఈ కోర్సులకు లెవల్ 1, 2, 3, 4 పరీక్షలు ఉండగా, లెవల్ 2, 4లో పబ్లిక్ ఎగ్జామ్లు నిర్వహిస్తారు.

ఇందులో అర్హత సాధిస్తే సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నించవచ్చు. అంతేకాదు టీచర్లు ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర ఉద్యోగ ఆధారిత కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

అద్భుత ఫలితాలు

ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ. శ్రుతిలయ (ఎంపీసీ, ఫస్ట్ ఇయర్) 468/ 470 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమెతో పాటు జి. గాయత్రి (ఎంపీసీ, ఫస్ట్ ఇయర్) 465/470, జి. వర్షిత (సీఈసీ, ఫస్ట్ ఇయర్) 490/500, కే. భార్గవి (ఎంఈసీ, ఫస్ట్ ఇయర్) 492/500, సి. స్పందన (ఎంపీసీ, ఫస్ట్ ఇయర్) 417/470, సర్బజిత్ (ఎంపీసీ, సెకండ్ ఇయర్) 974/1000, కె. ఉషశ్రీ (బైపీసీ, సెకండ్ ఇయర్) 972/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.

అలాగే, 10వ తరగతిలో వై. సంజన 553/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్ సాధించింది. 8వ తరగతి విద్యార్థులు 9 మంది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్‌ఎంఎంఎస్------2024) కింద ఎంపిక య్యారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12,000 స్కాలర్ షిప్ అందుతుంది.

సైన్స్ ఫేర్ లో జపాన్ వెళ్లిన విద్యార్థి

సెకండియర్ స్టూడెంట్ సర్బజిత్ సైన్స్ ఫేర్ టాలెంట్ టెస్టులో స్టేట్ లెవల్ కు ఎం పికై జపాన్ వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇతను స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ (ఎస్ ఐసీ) కింద నిర్వహించిన ‘సకుర సైన్స్ ప్రాజెక్టు’ టాలెంట్ టెస్టులో జిల్లా ఫస్ట్ వచ్చి  స్టేట్ లెవల్ కు ఎంపికయ్యాడు.

అక్కడ నిర్వహించిన పరీక్షలో తెలంగాణ నుంచి ఐదుగు రుని ఎంపిక చేయగా... అందులో సుర్బజిత్ స్థానం రెండో స్థానం సాధించాడు. ఈ ఐదుగురిని ప్రభుత్వం 2024 నవంబర్ 5న ‘షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్’ పేరుతో జపాన్ పర్యటనకు తీసుకెళ్లింది. అక్కడ వీళ్లు మల్టిపుల్ ఇనిస్టిట్యూషన్స్, లైబ్రరీలను విజిట్ చేయడంతో పాటు నోబుల్ బహుమతి గ్రహీతల ఇంటరాక్ట్ అయ్యారు.

మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై యాప్ ద్వారా కోచింగ్

‘మోడల్ స్కూల్ సొసైటీ’ అభివృద్ధి చేసిన ‘షాన్ అకాడమీ’ యాప్ ద్వారా 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై బేసిక్స్, స్కిల్స్ నేర్పిస్తున్నారు. స్కూల్ సమయంలో బోధనతో పాటు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా గైడెన్స్ అందిస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, తదుపరి లెసెన్ కు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. అదే యాప్ ద్వారా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్ల్పీ స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు.

స్కూల్ ను టాప్ కు తీసుకెళ్లడమే లక్ష్యం

మోడల్ స్కూల్, కాలేజీని రాష్ట్రంలో టాప్ ప్లేస్ కు తీసుకెళ్లడమే లక్ష్యంగా పె ట్టుకున్నం. మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మెరిట్ స్కాలర్ షిప్ లకు ఎంపికవుతున్నారు. అడ్మిషన్లకు విపరీతంగా కాంపిటీషన్ ఉంటోం ది. ఆమెజాన్ సంస్థ సహకారంతో అన్ని వసతులు కల్పించాం. స్కూల్ మెయిన్ గేటు నుంచి బిల్డింగ్ వరకు సీసీ రోడ్డు వేయించాలని కోరాం. వాళ్లు త్వరలోనే వేస్తామని చెప్పారు. 

చిన్నపు రెడ్డి, చేవెళ్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్