17-06-2025 12:00:00 AM
హాజీపూర్ (మంచిర్యాల), జూన్ 16 (విజయక్రాంతి): హాజీపూర్ మండలం ముల్క ల్ల రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసన సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్ విధానం ద్వారా రైతు నేస్తం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలోని రైతువేదికలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలి సి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, హాజీపూర్ తహశిల్దార్ శ్రీనివాసరావు దేశ్పాండే, మం డల వ్యవసాయ అధికారి కృష్ణ, వ్యవసాయ విస్తరణా ధికారి మౌనిక, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, ఆత్మ చైర్మన్ మురళి, సంచాలకులు కుమార్ యాదవ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామారావు, అభ్యదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.