బోయిన్పల్లిలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రప్రతిష్ఠ మహోత్సవం
అమ్మవారిని దర్శించుకున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, దిశ రవిచందర్
సికింద్రాబాద్, జూలై 12 (విజయక్రాంతి): బోయిన్పల్లిలోగల శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయములో విగ్రప్రతిష్ట మహోత్సవం,కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎన్. శ్రీనివాస్, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, దిశ రవిచందర్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు టి.ఎన్.శ్రీనివాస్, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, దిశ రవిచందర్ శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు.






