16-06-2025 12:08:51 AM
విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీలు
అచ్చంపేట, జూన్ 15:భూతల్లినే నమ్ముకొని వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్న రైతులకు పంటలు పండించే క్రమంలో ఎరువులు విత్తనాలు నకిలీవి అంటగడితే దుకాణదారులపై పిడి యాక్ట్ నమోదు తప్పనిసరి చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లోని రిజిస్టర్లు, ఎరువులు విత్తనాలను, స్టాక్ పాయింట్ లను విపులంగా పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదుతో పాటు వారి లైసెన్సులు సీజ్ అవుతాయన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు సమాచారం ఉంటే, రైతులు స్థానిక పోలీస్ స్టేషన్, వ్యవసాయ అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. వారితోపాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ తదితరులుఉన్నారు.