16-06-2025 12:11:08 AM
- ప్రైవేట్ బడుల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు
- బడుల్లోనే యూనిఫామ్స్, నోట్, పాఠ్యపుస్తకాల విక్రయాలు
- నిబంధనలకు తూట్లు..!
- పట్టించుకోని అధికారులు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
వనపర్తి, జూన్ 15 (విజయక్రాంతి): తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎం తైన ఖర్చు చేస్తారన్న బలహీనతను ప్రైవేట్ పాఠశాల యజమాను లు ఆసరాగా తీసుకుంటున్నారు. ఫీజులు ఎంత పెంచినా అడిగే వారుండరని ఇష్టారీతిగా పెంచుతున్నారు. పాఠశాలలో టెక్నో, ఈ బ్యాచ్ ఆబ్యాచ్ లం టూ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులకు గార డీ చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తమ పాఠశాలలో మెరుగైన వసతులు ఉన్నాయ ని, రంగు రంగుల కర పత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు.
కొన్ని ప్రైవేట్ పాఠశాలలో 20 నుంచి 30శాతం ఫీజులు పెం చు తున్నారు. దీనికి తోడు విద్యార్థుల యూనిఫామ్స్, పుస్తకాలు అయా పాఠశాలలకు అనుబంధంగా కొన్నిషాపుల యజ మానులతో బేరం కుదుర్చుకుని యాదేచ్చగా విక్ర యిస్తున్నారన్న విమర్శలు బహిరంగానే వినిపిస్తున్నాయి. తమ పాఠశా లలకు సంబం ధించిన పుస్తకాలు ఎక్కడా లభించవని, తా ము చూపించిన దుకాణంలోనే దొరుకుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్తూ సొ మ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా వ్యా ప్తంగా ఉన్న కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించు కోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇష్టారీతిగా వసూళ్లు...
పాఠశాలలు జూన్ 12 నుంచి పునఃప్రారంభించినా విద్యార్థుల చేరికలు మాత్రం మే చివరి నుంచే ప్రారంభించారు. విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో అడ్మిషన్ టెస్టు ఫీజు రూ.500 నుండి 10 00 ల వరకు తీసుకుంటున్నారని , తరగతిని బట్టి ట్యూషన్ ఫీజు నిర్ణయిస్తున్నారు . కొన్ని ప్రవేట్ పాఠశాలలో యూకేజీకి రూ. 25 వేలు, పదో తరగతికి రూ 58 వేల వరకు నిర్ణయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి కొ న్ని పాఠశాలల్లో అయితే మరో 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచడంతో పాటు స్కూల్ యూనిఫామ్స్, షూ, టై బైల్ట్కు రూ.3 వేల నుంచి రూ. 6 వేల వరకు, బస్సు ఫీజు రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తం ఫీజు లెక్కలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రుల గుండె గుబేల్ మంటోంది. కానీ పిల్లల భవిషత్తు కోసం ఎంత ఖర్చు అయినా మంచి పాఠశాలల్లో చేర్పించాలన్న నిర్ణయం అప్పు ల ఉబీలోకి నెట్టి పడేస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ కరువు
విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలను పట్టిం చుకోవడం లేదన్న విమర్శ లు వస్తున్నాయి. ఫీజుల నియంత్ర ణ కమిటీ, పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయడంలేదు. పరిమితికి మించి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకున్నా విద్యాశాఖ అధికారులు ప్రవేట్ పాఠ శాలల వైపు కన్నెత్తి చూడటం లేద న్న విమర్శలు ఉన్నాయి.
నిబంధనలకు తూట్లు..!
ప్రైవేటు స్కూళ్ల పర్యవేక్షణ, ఫీజుల ని యంత్రణ కోసం ప్రభుత్వం 1994లో జీవో నంబర్ 1 జారీ చేసింది. కానీ ఈ జీఓను అ టు అధికారులు, ఇటు యాజమాన్యాలు ప ట్టించుకోవడం లేదు. ఇందులోని 12వ నిబంధన ప్రకారం ప్రతి ప్రైవేటు విద్యా సం స్థ తమ వార్షికాదాయ వ్యయాలను ఆడిట్ చేయించాలి. అనంతరం ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా అలా చేయడం లేదన్న వి మర్శలు ఉన్నాయి. అంతేకాదు మొత్తం వా ర్షికాదాయంలో స్కూల్ సిబ్బంది జీతాలు, ఫర్నీచర్, అభివృద్ధి ఖర్చు పోగా, మిగిలిన దానిలో కేవలం 5 శాతాన్నే లాభంగా తీసుకోవాలి. కానీ వాస్తవానికి ఈ నిబంధన ఎక్క డా అమలుకు నోచుకోవడం లేదని కేవలం 5 నుండి 10 శాతం మాత్రమే ఖర్చు చేస్తూ 90 శాతం వరకు యాజమాన్యాలు మిగు ల్చు కుంటున్నారన్న ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.
గవర్నింగ్ బాడీ ఎక్కడ ....
యాజమాన్య ప్రతినిధులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రతి ప్రవేట్ పాఠశాలలో తప్ప నిసరిగా గవర్నింగ్ బాడీ ఉండాలి . ఆ ప్రాం త ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా గవర్నింగ్ బాడీ విద్యార్థుల ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఏటా ఫీజుల వివ రాలు, అయిన ఖర్చుతో పాటు వార్షిక అకడమిక్ నివేదికను తయారు చేయించి సం బందించిన అధికారుల ముందుంచాలి.
దీనిని వారు ఆమోదించాలి. అయితే పాఠశా ల ఏర్పాటు నుండి ఏ ఒక్క పాఠశాల కూడా వార్షిక అకడమిక్ నివేదికను తయారు చేయి ంచడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం పై చూసీచూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యను అందించాల్సి ఉం టుంది. కానీ ఏ ఒక్క స్కూలు కూడా ఈ ని బంధనలు పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.