calender_icon.png 5 June, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం లేకపోతే ఆవిర్భావం పట్టదా?

04-06-2025 12:24:52 AM

  1. వేడుకలకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు..? 
  2. పొత్తులపై ఏ హోదాలో హరీశ్‌రావు మాట్లాడుతున్నారు 
  3. విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, జూన్ 3(విజయక్రాంతి) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను త మ ప్రభుత్వం పండుగలా చేసిందని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా బాధ్యతాయుతంగా వ్య వహరించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. అయితే మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవంలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘కనీసం ఫా మ్‌హౌ స్‌లోనైనా అమరవీరులను స్మరించుకోవచ్చు కదా..? అమరవీ రులకు నివాళులు అర్పించడానికి చేతులు రాలేదా..? అధికారం ఉంటేనే అమరవీరులు గుర్తుకువస్తారా..?’ అని నిలదీశారు. మంగళవారం ఆది శ్రీనివాస్ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో, కేటీఆర్ అమెరికాలో, కవిత ఆమె ఆఫీసుకే పరిమితమయ్యారని విమర్శించారు.

బీఆర్‌ఎస్ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోదని మాజీమంత్రి హరీశ్‌రావు అమాయకంగా మాట్లాడుతున్నారని, ఎన్నికల వరకు అసలు బీఆర్‌ఎస్ ఉంటే కదా పొత్తులు పెట్టుకోవడానికి అని ఎద్దేవా చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయడానికి ప్ర యత్నా లు జరుగుతున్నాయని, ఆ విషయా న్ని కేసీఆర్ కూతురు కవితనే స్వయంగా బ యటపెట్టారని గుర్తుచేశారు. ఆ రెండు పార్టీలు విలీనం కావడం ఖాయమని తెలిపారు.

పొత్తుల గురించి మా ట్లాడానికి హరీశ్‌రావు ఎవరు? ఆయనకు పార్టీ లో ఏ హోదా ఉంది? బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో హరీశ్‌రావు ఒకరు మాత్రమే అని చెప్పారు. బీఆర్‌ఎస్ రజతోత్సవంతోనే బీఆర్‌ఎస్‌లో ఇద్దరు మాత్రమే లీడర్లని తేల్చారని, హరీశ్‌రావు ఫొటోను కూడా రజతోత్సవ సభ లో పెట్టలేదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పకుండానే హరీశ్‌రావు ఎందుకు పొత్తులపై ప్రకటన చేస్తున్నారని ప్రశ్నించారు. హరీశ్‌రావుకు దమ్ముంటే ముందుగా కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

మాటతప్పడం హరీశ్‌రావుకు అలవాటే 

రైతు రుణమాఫీ రూ.21వేల కోట్లు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు దొంగ సవాల్ చేస్తున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో సవాల్ విసిరిన హరీశ్‌రావు మాట తప్పారన్నారు. రాజన్న ఆలయంలో కోడెల మరణంపైన ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, అనారోగ్యం కారణంగా కోడెలు చనిపోయాయని తెలిపారు.