11 April, 2026 | 9:37 AM

అవినీతిని ప్రశ్నిస్తే నిందలా?

29-06-2024 12:05 AM
  • బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకే అభివృద్ధి నిధులు
  • మున్సిపల్ చైర్‌పర్సన్‌పై కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆగ్రహం

సూర్యాపేట, జూన్28 (విజయక్రాంతి): మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు తమ వార్డుల అభివృద్ధికి నిధులను ఇవ్వకపోవడమే కాక తమపై నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్‌లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లా డారు. గురువారం చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో తమపై కక్ష పూరితంగా చైర్ పర్సన్ అన్నపూర్ణ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అసత్య ఆరోపణలు చేశారని మం డిపడ్డారు.

గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కాంగ్రెస్ కౌన్సిలర్లు మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి పేరుతో కేవలం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు రూ.5 లక్షలు కేటాయించారని ఆరో పించారు.  అవినీతిని ప్రశ్నించిన 31 మంది కౌన్సిలర్లకు నిధులను కేటాయించలేదని దు య్యబట్టారు. హరితహరం పేరుతో రూ.3 కో ట్లు ఖర్చు చేసి నాటిన లక్ష మొక్కలు ఏమయ్యాయని వివరణ అడిగితే మేకలు తిన్నా యని సమాధానం ఇచ్చారని ధ్వజమెత్తారు. మున్సిపల్ వాహనాల  పంక్చర్లు, టైర్లు, ట్యూ బ్‌లకు రూ.40 లక్షలు ఖర్చు చేశామని అజెండాలో పేర్కొన్నారని తెలిపారు.

రూ.30 కోట్ల తో ఇంటిగ్రేటేడ్ మార్కెట్  నిర్మించి అప్పటి సీఎం కేసీఆర్‌తో ప్రారంభిస్తే పట్టుపని పదిరోజులు కూడా వ్యాపారాలు నడువలేదని అన్నారు. డంపింగ్ యార్డ్ కోసం  రూ.90 లక్షలతో తెచ్చిన మిషన్ మెయింటెన్స్‌కు రూ.35 లక్షలు ఖర్చు చేశారని విమర్శించారు. సమావేశంలో కౌన్సిలర్లు బైరు శైలేందర్, బచ్చలకూరి శ్రీనివాస్, యాదగిరి, రాజేందర్, శబరి, చంద్రునాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.