1 April, 2026 | 2:31 AM

నీటి సమస్యలపై తక్షణ స్పందన

01-04-2026 12:00 AM

ఆసుపత్రికి అదనపు ట్యాంకర్లకు ఎమ్మెల్యే తలసాని ఆదేశాలు

సనత్‌నగర్, మార్చి 31 (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తారని మరోసారి నిరూ పించారు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్ పేట డివిజన్‌లోని బిజెఆర్ నగర్‌లో  కలుషిత నీరు సరఫరా అవుతుందని, ౫౦ పడక ల ప్రభుత్వ హాస్పిటల్‌లో నీటి సరఫరా సరిపడా లేక రోగులు, వారివెంట వచ్చే సహా యకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు.

ముందుగా వారు ఏప్రిల్ 2న నిర్వహించే హనుమాన్ జయంతి కార్యక్రమంకు ఆహానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఆయన వెంటనే అమీర్ పేట సర్కిల్ వాటర్ వర్క్స్ అధికారి  సతీష్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 2 ట్యాంకర్లయిన పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు హన్మం తరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, కట్టా బలరాం తదితరులు ఉన్నారు.