23-06-2025 04:29:49 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పర్యావరణ ప్రణాళిక వంద రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు పర్యావరణ, పరిసరాల పరిశుభ్రతపై రంగవల్లికలు వేశారు. కార్యాలయం ఎదుట వేసిన రంగవల్లికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు ప్రభాకర్, సంతోష్, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు అనసూయ, సంధ్య, సునీత, స్వర్ణలత, లక్ష్మి, శ్రీలత, రమేష్, సుశీల, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, నర్మద, సాగర్ పాల్గొన్నారు.