calender_icon.png 23 June, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

23-06-2025 04:16:08 PM

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఎదుట మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్థన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి హాజరయ్యారు.  అప్పటి రివ్యూ కమిటీ సభ్యులు జీఏడీ సెక్రటరీ శేషాద్రి, మాజీ సీఎస్ శాంతి కుమారి, లా సెక్టటరీ వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. శాంతి కుమారి విదేశాల్లో ఉన్నందున.. వచ్చాక వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించినట్లు రివ్యూ కమిటీ తెలిపింది. ఇప్పటి వరకు ఐదుసార్లు జరిగిన దర్యాప్తులో ప్రభాకర్ రావు అధికారులు అడిగిన ప్రశ్నాలకు సరైన సామాధానం చేప్పకుండా దాట వేశారని సమాచారం. మేడ్చల్ మాల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి రేపు సిట్ ఎదుట వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలో ఈటల రాజేందర్ ఒకరు.

వాంగ్మూలం ఇవ్వాలని గతంలోనే ఈటలకు సిట్ అధికారులు తెలిపినప్పటికి ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరుకాలేదని గతంలో ఆయన వెల్లడించారు.  అలాగే బీజేపీ నేత ప్రేమేంద్ర రెడ్డి రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ ముందు హాజరైవాంగ్మూలం ఇవ్వనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తేల్చింది. ప్రభాకర్ రావు చెప్పే విషయాలతోనే రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం తెలుతుందని సిట్ అధికారులు పేర్కొన్నారు.