calender_icon.png 18 September, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాగత తోరణం ప్రారంభోత్సవం

18-09-2025 07:42:54 PM

ప్రారంభించిన వజ్రెష్ యాదవ్..

మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గం, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ లో ఉన్న జ్యోతినగర్ స్వాగత తోరణాన్ని మాజీ మేయర్ అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రమా వెంకటేష్ యాదవ్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్(Constituency Incharge Vajresh Yadav) ప్రారంభించారు. ఈ స్వాగత తోరణాన్ని మాజీ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ తన సొంత నిధులతో ఏర్పాటు చేయించడం జరిగింది. గడిచిన మున్సిపల్ ఎన్నికల సమయంలో తనను ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించిన జ్యోతినగర్ కాలనీవాసులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, వారి విన్నపం మేరకు కాలనీలో అనేక అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులను, మెరుగుపరిచానని ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రమా వెంకటేష్ యాదవ్ అన్నారు.

కాలనీవాసుల కోరిక మేరకు ఈ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశానని భవిష్యత్తులో వారికి ఎటువంటి సహాయం అవసరమైన తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  సొంత ఖర్చులతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయించిన మాజీ కార్పొరేటర్ రమా వెంకటేష్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్, ఆర్టియే మెంబెర్ జైపాల్ రెడ్డి, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సీసా వెంకటేష్ గౌడ్, బొమ్మకు కళ్యాణ్,కుంభం కిరణ్ రెడ్డి, సుమన్ నాయక్, బింగి జంగయ్య యాదవ్, జక్కా రాములు,  మరియు కాంగ్రెస్ నాయకులు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.