ఏ కోర్టుకు వెళ్లాలో చెప్పండి సారూ?
ఇల్లంతకుంట, మార్చి 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం.మోకా మీద వివాదం ఉందని న్యాయస్థానానికి వెళ్ళి పరిష్కరించుకోండి అని తెలిపిన ఇల్లంతకుంట తహశీల్దార్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇల్లంతకుంట మండలం జవహర్ పేట గ్రామానికి చెందిన గోకులకొండ మల్లయ్య తన భూమి భూ భారతి పోర్టల్ లో తప్పుగా నమోదు అయిందని, దీనిపై సదరు మల్లయ్య ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే సదరు బాధితుడిని విచారణ నిమిత్తం రోజుల తరబడి తిప్పడంతో పాటు చివరగా మీ సోదరుల మధ్య వివాదం ఉందని, దానిపై మీరు న్యాయస్థానానికి వెళ్ళి పరిష్కరించుకోండి అని తహశీల్దార్ మల్లయ్య కు మెమో జారీచేశాడు. దీనిపై బాధితుడు బాధపడుతూ విజయక్రాంతి పత్రిక ప్రతినిధికి తన గోడును వెళ్లబోసుకున్నాడు.దీనిపై సదరు బాధితుడు మాట్లాడుతూ నన్ను ఏ కోర్టు కు వెళ్ళమంటారో చెప్తే అదే కోర్టు కు వెళ్ళి న్యాయం కోసం పోరాడుతానని తెలిపారు. ఏది ఏమైనా పరిష్కరించిన రెవెన్యూ అధికారులే కోర్టు వెళ్లమనడం గమనార్హం.




