24-06-2025 05:01:34 PM
జనగామ (విజయక్రాంతి): తరిగొప్పుల మండలం(Tarigoppula Mandal)లోని స్థానిక తహసిల్దార్ ఆఫీసులో గత రెండు రోజుల నుండి సాంకేతిక సమస్య అంటూ భూభారతి పనిచేయడం లేదని అధికారులు చెప్పడంతో మండల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయ పనులు వదులుకోని కూలీలను పెట్టి తహసిల్దార్ ఆఫీస్ కు వచ్చి తహసిల్దార్ ఆఫీస్ లో సర్వర్ సమస్యతో పనులు కాక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. భూభారతి వచ్చిన నుండి సమస్యల నిలయంగా నిలిచింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.