05-07-2025 12:32:15 AM
చివరి దశకు భారత్ వాణిజ్య ఒప్పందం
సుంకాల వివరాలతో పలు దేశాలకు లేఖలు పంపనున్న అమెరికా
9తో ముగియనున్న సుంకాల మినహాయింపు గడువు
వాషింగ్టన్: భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం నేడో రేపో ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుంకాల అమలును జూలై 9 వరకు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఆ గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒప్పందాన్ని తొందరగా ఖరారు చేసేందుకు రెండు దేశాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా వేయబోయే సుంకాల గురించి వివరిస్తూ నేటి నుంచి రోజుకు పది దేశాలకు లేఖలు రాయనున్నట్టు అధ్యక్షుడు తెలిపారు.
ఈ లేఖల్లో ఎంత శాతం సుంకం వేసే వివరాలు సమకూర్చనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎవరైతే తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేదో ఆ దేశాలు అధిక సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ట్రెజరీ కార్యదర్శి హెచ్చరించారు. సుంకాలపై ఉన్న డెడ్లైన్ను పొడగించవచ్చు లేదా కుదించవచ్చు అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 90 రోజుల గడువు జూలై 9తో ముగియనుంది. ఇప్పటికే అమెరికా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.