30 August, 2026 | 10:08 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

భారత్ విదేశీ రుణాలు 647 బిలియన్ డాలర్లు

04-12-2024 11:30 PM

ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత్ మొత్తం విదేశీ రుణం 2023 సంవత్సరం చివరినాటికి 31 బిలియన్ డాలర్ల మేర పెరిగి 647 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.54.83 లక్షల కోట్లు) చేరినట్లు ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఈ రుణాలకు భారత్ వడ్డీ చెల్లింపులు 22.54 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నది.

2022లో చెల్లించిన వడ్డీలు 15.08 బిలియన్ డాలర్లు. దీర్ఘకాలిక రుణాలు 7 శాతం పెరిగి 498 బిలియన్ డాలర్లకు చేరగా, స్వల్పకాలిక రుణాలు మాత్రం స్వల్ప తగ్గుదలతో 126.32 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఇండియా విదేశీ రుణాలు ఎగుమతుల్లో 80 శాతంకాగా, వడ్డీ చెల్లింపులు ఎగుమతుల్లో 10 శాతమని రిపోర్ట్ వివరించింది.