30 August, 2026 | 8:59 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ వాటా విక్రయం

05-12-2024 12:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వొడాఫోన్ ఐడియాలో భాగస్వామి అయిన బ్రిటన్ టెలికాం సంస్థ వొడాఫోన్  ఇండస్ టవర్స్‌లో 3 శాతం వాటాను రూ.2,841 కోట్లకు విక్రయించడానికి సిద్ధమయ్యింది. తమ ఇండియా వెంచర్ వొడాఫోన్ ఐడియాకు సంబంధించిన బకాయిలు రూ.856 కోట్లు చెల్లించేందుకు, ఇతర రుణాల చెల్లింపునకు వాటా విక్రయిస్తున్నట్లు ఎక్సేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

ఇండస్ టవర్న్ షేరు బుధవారం రూ.358 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద వొడాఫోన్ 3 శాతం వాటాను (7.92 కోట్ల షేర్లు) విక్రయిస్తే రూ.2,841 కోట్లు సమకూరుతుంది. ఓపెన్ మార్కెట్లో బుక్‌బిల్డింగ్ రూపంలో విక్రయ లావాదేవీ జరపనున్నట్టు వొడాఫోన్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ 18 శాతం వాటాను విక్రయించి రూ. 15,300 కోట్లు సమీకరించింది. టవర్స్ కంపెనీలో ప్రస్తుతం బ్రిటన్ సంస్థకు 3.1 శాతం వాటా ఉన్నది.