19-06-2025 09:09:43 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. 60వ డివిజన్ వడ్డేపల్లి, 58వ డివిజన్ ఎస్సీ కాలనీ, 57వ డివిజన్ సమ్మయ్యనగర్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిర్మ కాలనీలు ఉంటాయని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామని తెలిపారు.
ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఆశ్రయం మాత్రమే కాదు – అది గౌరవం, భద్రత, స్వాతంత్ర్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేయడమే మా ధ్యేయం అని తెలిపారు. మొత్తం మూడు డివిజన్లలో ప్రారంభించిన ఇండ్ల నిర్మాణ పనులు వందలాది కుటుంబాలకు ఆశ కలిగించాయని తెలిపారు. లబ్ధిదారులు తమ మనసు తల్లడి కళ్లలో ఆనందంతో ఎమ్మెల్యే ని ప్రత్యేకంగా సన్మానించారు. అంతకుముందు 60 వ డివిజన్ టీచర్స్ కాలనీలో 5 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 60 వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ ఎనుకంటి నాగరాజు, 58, 60 డివిజన్ ల అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, ఎనుకంటి పున్నం చందర్, కాంగ్రెస్ నాయకులు ఎండి నేహాల్, మండల సమ్మయ్య, తాళ్లపల్లి మేరీ, తాళ్ల పెళ్లి రవీందర్, తాళ్లపల్లి విజయ్ కుమార్, బుస్సా నవీన్ కుమార్, మట్టపల్లి కమల్, ఎండి సాజిద్, మిడిదొడ్డి శేఖర్, పిట్టల శేషు, తాళ్ల పెళ్లి ప్రసన్నకుమార్, బిజెపి 60 వ డివిజన్ అధ్యక్షుడు రోకుల సతీష్, బిజెపి నాయకులు నాగపురి అశోక్, మట్టపల్లి రామ్ రాజ్, కటకం యాదగిరి, శివ కాలనీ సంఘాల నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.