19-06-2025 09:04:32 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): దుబ్బాకలో రేపు నిర్వహించబోయే ఇందిరమ్మ లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు(Congress Party Mandal President Padala Ramulu) అన్నారు. దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) చేతుల మీదుగా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు బాలశేఖర్ రెడ్డి, గొల్ల మల్లేష్ తదితరులు ఉన్నారు.