16 April, 2026 | 9:42 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అర్హులెన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు

08-05-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్ (చెన్నూర్), మే 7 (విజయక్రాం తి): అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వపరంగా ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పను లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభు త్వం అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు అందించ డం జరుగుతుందని, సొంత స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు తమ ఇండ్లను నిబంధనల ప్రకారం 600 చదరపు గజాలలోపు నిర్మించుకోవాలన్నారు.

అర్హత గల ఇందిర మ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా రూపొందించాలని, జాబితా తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని, అనర్హుల వివరాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పం చాయతీ అధికారి శ్రీపతి బాపు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.