6 July, 2026 | 4:11 PM

Breaking News

ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •  

అర్హులెన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు

08-05-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్ (చెన్నూర్), మే 7 (విజయక్రాం తి): అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వపరంగా ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పను లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభు త్వం అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు అందించ డం జరుగుతుందని, సొంత స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు తమ ఇండ్లను నిబంధనల ప్రకారం 600 చదరపు గజాలలోపు నిర్మించుకోవాలన్నారు.

అర్హత గల ఇందిర మ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా రూపొందించాలని, జాబితా తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని, అనర్హుల వివరాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పం చాయతీ అధికారి శ్రీపతి బాపు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.