calender_icon.png 3 January, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బృహత్ నగరానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు

03-01-2026 12:17:47 AM

జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్

లింకు బ్రిడ్జి ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం

ఎమ్మెల్యే ముఠా గోపాల్

రూ. 6 కోట్ల వ్యయంతో లింకు బ్రిడ్జి ప్రారంభం

ముషీరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయా లు పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ శుక్రవారం జీహెచ్‌ఎంసీ నిధులు రూ.6 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి దోమల గూడ లింక్ బ్రిడ్జిని రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మోహన్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ కర్ణన్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

అనంతరం జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓఆర్‌ఆర్ లోపల, ఓఆర్‌ఆర్ ను అనుకుని ఉన్న పురపాలికల విలీనంతో విస్తీర్ణం, జనాభా పరంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించిందని అన్నారు. అతి పెద్ద నగరంలో జనాభాకు తగ్గట్టు రోడ్లు, డ్రైన్ లు, వీధి దీపాలు, పార్క్ లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు అభివృద్ధికి సీఎం సమగ్ర ప్రణాళికలతో ముందుకుసాగుతున్నారని తెలిపారు.

రాష్ట్ర స్టేట్ హెడ్ క్వార్టర్ గా, క్యూర్ లోపలి ప్రాంతంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ను ప్రత్యేక ప్రాధాన్యతన నిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ చిక్కడపల్లి అశోక్ నగర్ ప్రాంత ప్రజలు నేరుగా పంజాగుట్ట సెక్రటేరియట్ కు వెళ్లేందుకు దారి సుగమమైందని అన్నారు వారి సౌకర్యార్థం చిక్కడపల్లి- దోమలగూడ లింకు బ్రిడ్జి ఏర్పాటుకు అధికారు లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ లింకు బ్రిడ్జి ద్వారా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కవాడిగూడ, గాంధీనగర్ కార్పొరేటర్లు గోడ్చల రచన శ్రీ, ఎ. పావని వినయ్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు ముఠా జై సింహ, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్ లు, ఎస్‌ఈ మోహన్ రెడ్డి, ఈఈ రోహిణి, డిఈఈ రేణుక, ఏఈఈ ప్రశాంత్, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు జి. వెంకటేష్, పరిమల్ కుమార్, ఎ. వినయ్ కుమార్, ప్రభా కర్, సురేష్, వల్లాల శ్యామ్, ఎన్ డి సాయి కృష్ణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలకు తప్పనున్న బాధలు

హుస్సేన్ సాగర్ నాలాపై జీహెచ్‌ఎంసీ నిధులు రూ.6 కోట్లతో లింకు బ్రిడ్జిని నిర్మించిన చిక్కడపల్లి దోమల గూడ లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ దోమలగూడ వైపు గతానికేంటే సగం తక్కువ సమయంలోనే లిబర్టీ, జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్, సచివాలయంకు వచ్చే వీలుకలుగుతుంది. ప్రజలకు దూర బాధలు తప్పనున్నాయి. బ్రిడ్జిని అందుబాటులోకి తేవడం పట్ల నాలా ఇరుపక్కల కాల నీల ప్రజల హర్షం వ్యక్తం చేశారు. ప్రభు త్వం, జీహెచ్‌ఎంసీకి కృతజ్ఞతలు తెలిపారు.