27-06-2025 05:25:16 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు వెంకటేష్(AISF District President Rama Rao Venkatesh) డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖాళీగా ఉన్న లక్షణాలను పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ కళాశాలలో సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా కంప్యూటర్స్, పరికరాలను అందుబాటులో ఉంచి నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థులు లేరనే సాకు తో ప్రభుత్వం 12 ఏసి గురుకుల ఇంటర్ కళాశాల మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలి అన్నారు లేని ఎడల విద్యార్థులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
Infrastructure should be provided in government colleges