బీఎస్ఈ,ఎన్ఎస్ఈలో ఇన్సోలేషన్ ఎనర్జీ షేర్లు
ముంబై ః సోలార్ ప్యానెల్ తయారీ రంగంలోని ప్రముఖ సంస్థ ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. కంపెనీ తన రూ.1 ముఖ విలువ కలిగిన 22,03,94,625 ఈక్విటీ షేర్లను బీఎస్ఈ లిమిటెడ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మెయిన్బోర్డ్లో విజయవంతంగా లిస్ట్ చేసింది. ఇంతకుముందు ఈ కంపెనీ బీఎస్ఈ యొక్క ఎస్ఎంఈ ప్లాట్ఫారమ్లో లిస్ట్ అయి ఉండగా, ఇప్పుడు బీఎస్ఈ మెయిన్బోర్డ్కు మైగ్రేషన్కు , ఎన్ఎస్ఈ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్లో నేరుగా లిస్టింగ్కు తుది అనుమతి పొందింది.
తాజాగా కంపెనీ షేర్లు రెండు ప్రధాన ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్కు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ శ్రీ మనీష్ గుప్తా మాట్లాడుతూ, “బీఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ మెయిన్బోర్డ్లో మా లిస్టింగ్ కంపెనీ అభివృద్ధి ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఇది మా పెట్టుబడిదారుల విశ్వాసం, మా బృందం కృషి మరియు బలమైన కార్పొరేట్ గవర్నెన్స్పై మా నిబద్ధత ఫలితం. ఈ అడుగు కంపెనీ విశ్వసనీయతను మరియు అభివృద్ధిని కొత్త దిశలోకి తీసుకెళ్తుందని మాకు నమ్మకం ఉంది” అని చెప్పారు.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జైన్ మాట్లాడుతూ ఎస్ఎంఈ ప్లాట్ఫారమ్ నుంచి మెయిన్బోర్డ్ వరకు మా ప్రయాణం కేవలం ఒక సాధన మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద బాధ్యత కూడా. సాంకేతిక ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ మరియు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా సౌరశక్తి రంగంలో మా బలమైన ఉనికిని కొనసాగించడానికి కంపెనీ కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ దేశంలో సౌరశక్తి రంగంలో వేగంగా ముందంజలో నిలుస్తోందనీ, రాష్ట్రంలో సోలార్ తయారీని ప్రోత్సహించడానికి అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేస్తున్నారనీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎనర్జీ మంత్రి హీరాలాల్ నగర్ మాట్లాడుతూ,
తెలిపారు. ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు రాజస్థాన్ను సోలార్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనీ చెప్పుకొచ్చారు. కంపెనీ బీఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ మెయిన్బోర్డ్లో లిస్ట్ కావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మరియు స్వచ్ఛ శక్తి విస్తరణకు సానుకూల సంకేతమన్నారు.




