28-05-2025 12:00:00 AM
జిల్లా అధికారులకు నివేదిస్తామన్న మండలాధికారులు
చేవెళ్ల, మే 27:చేవెళ్ల మండలం చన్వల్లి, పామెనలో నాసికరం నారు కారణంగా నష్టపోయిన బజ్జి మిర్చి పంటను ఉద్యాన శాఖ అధికారి కీర్తి కృష్ణ, మండల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ పరిశీలించారు. మంగళవారం విజయ క్రాంతి దిన పత్రికలో ‘ నిండా ముంచిన ‘మీనం’ సీడ్స్’ శీర్షికతో స్టోరీ వచ్చిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన అధికారులు క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించారు.
మొత్తం ఎంత మంది రైతులు నష్టోయారు.. ఎంత విస్తీర్ణం.. ? మొక్కలు ఎవరు సప్లై చేశారు.. ఎన్ని రోజుల కింద నారు వేశారు.. ? ఏ ఎరువులు, మందుల వాడారు..? తదితర వివరాలు సేకరించారు. ఖమ్మం జిల్లా వైరా పరిధిలో కొనిజెర్ల మండలం మధిర రోడ్డులో ఉన్న మహికో గ్రో నర్సరీ నుం చి కొరివి సునీల్ కుమార్ తమకు నారు సప్లై చేశాడని , రెండు గ్రామాల్లో కలిపి100 ఎకరాల్లో సాగు చేశామని రైతులు చెప్పారు.
మొత్తం 60 మంది ఒక్కో ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టపోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. బజ్జి మిర్చి పంట నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపిస్తామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు సైంటిస్టులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తారని, అక్కడి నుంచి వచ్చే రిజర్ట్ అధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బాధిత రైతు లు చన్వల్లి మాజీ సర్పంచ్ నర్సిములు, శ్రీకాంత్ రెడ్డి, కొంపల్లి వెంకట రెడ్డి, కుమ్మరి చింటు, మంగళి కృష్ణయ్య, సురిబాబు, కావలి రమేశ్, బాయికాడి నర్సింలు, చిరుమని జైపాల్ రెడ్డి, మనీశ్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.