calender_icon.png 11 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహాయక చర్యలు ముమ్మరం చేయండి

11-09-2025 01:01:28 AM

-భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టండి 

-ప్రభుత్వ ముందస్తు ప్రణాళికతో తగ్గిన నష్టం

-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం 

-వరద సహాయ చర్యలపై మంత్రి సమీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు.

ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలోని తన కార్యాలయంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, రాష్ర్ట ప్రకృతి విపత్తుల నిర్వహణా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సుల్తానియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందని పేర్కొన్నారు. సహాయక పనులను మరింత వేగవంతం చేయాలని, ఇప్పటి వరకు పరిహారాలు విడుదల చేయకపోతే వాటిని వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు.

ఏ ఒక్క బాధితుడు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండొద్దని, చెరువులు, కుంటలు, రోడ్ల మరమ్మతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. వరద సహాయానికి సంబంధించి వినియోగించిన నిధులకు యూసీలను కేంద్రానికి అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈనెల 13వ తేదీలోగా ఆయా విభాగాలు యూసీలు సమర్పించాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, హెల్త్, మున్సిపల్, ఆర్ అండ్‌బీ, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు..

నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్  కే శ్రీనివాసరెడ్డి, ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆర్‌వో జీ మల్సూర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.