10-12-2025 02:21:11 AM
రెండు రోజుల్లో 5.75 లక్షల కోట్లు

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం భారీగా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించింది. విజన్ డాక్యుమెంట్- 2047 ప్రకటించేందుకు ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. ఈ సమ్మిట్లో భాగంగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు నిర్వహించిన రెండు రోజుల్లో కలిపి రికార్డు స్థాయిలో రూ. 5.75 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి.
ఇందులో ముఖ్యంగా విద్యుత్, ఫార్మా, డేటా, పర్యాటక రంగాలు ఉన్నా యి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండోరోజు వివిధ కంపెనీల ప్రతిని ధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడంతో వారి తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యో గాలు పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు రానున్నాయి.
ఇన్ఫ్రాకీ డీసీ పారక్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టేందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిం ది. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్లతో డేటా సెంటర్లు, ఏజీపీ గ్రూప్ రూ. 6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయ నుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధన-అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ. 3,500 కోట్ల పెట్టుబడి ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి.
ఫెర్టి స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 2 వేల కోట్లు, పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి రూ. 200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు. వింటేజ్ కాఫీ అండ్ బెవ రేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్ఉడ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ. 1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 1,000 మంది వరకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ. 1,500 కోట్ల పెట్టుబడి, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది.
ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించ నున్నాయి. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అరబిందో ఫార్మా రూ. 2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3 వేలకి పైగా ఉద్యోగాలు సృష్టించనున్నారు.
ఫార్మా రంగంలో పెట్టుబడులు..
హెటిరో సంస్థ మందుల తయారీ యూని ట్ల విస్తరణకు రూ. 1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9 వేలకి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా రూ. 1,200 కోట్ల పెట్టుబడితో 2,500 నుంచి 3 వేల మందికి ఉపాధి కల్పించనుంది. భారత్ బయోటెక్ రూ. 1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవలకోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఆహార తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా రూ. 650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 1,551 మందికి ఉపాధి దొరకనుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ. 150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.
ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు..
ఫీఫా-ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్ హాకీ హబ్గా మార్చేందుకు హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫైయర్ 2026ను 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2026 ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం కానుంది.
పర్యాటక రంగంలో రూ. 7,045 కోట్లు
ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రూ.3 వేల కోట్లు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసారట్స్ రూ.వెయ్యి కోట్లు, సారస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. వెయ్యి కోట్లు, అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు) రూ. 800 కోట్లు, కేఈఐ గ్రూప్ (కామినేని గ్రూప్) రూ.200 కోట్లు, పోలిన్ గ్రూప్ (టర్కీ), మల్టీవర్స్ హోటల్స్ రూ. 300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్) రూ. 300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 300 కోట్లు, రిధిరా గ్రూప్ రూ. 120 కోట్లు, సలామ్ నమస్తే దోసా హట్ (ఆస్ట్రేలియా), విశాఖ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ ఐఫా ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్ల భాగస్వామ్యంతోరూ. 600 కోట్లు, టీడబ్ల్యూఐ గ్రూప్ ప్రపంచంలోనే తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోటా్ర్బక్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుంది. రూ. 1,100 కోట్లు పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాల కల్పన అవకాశాలు రానున్నాయి. మహీంద్రా అండ్ మహీం ద్ర జహీరాబాద్ యూనిట్ విస్తరణకు నాలుగేళ్లలో రూ. 500 కోట్లకు పైగా పెట్టుబడికి ముందుకొచ్చింది.
ఇండియా ఎక్స్ ట్రీమ్ అడ్వెంచర్ 20 ఎకరాల్లో ఎక్స్ ట్రీమ్ స్పోర్ట్స్, అడ్వెంచర్, ఈ--స్పోర్ట్స్ ఏర్పాటుకు అరేనా మొత్తంగా రూ.500 కోట్లు, బయోవరం టిష్యూ ఇంజినీరింగ్, రెజెనరేటివ్ మెడిసిన్, సెల్-జీన్ థెరపీకి ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు రూ. 250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. జ్యూరిక్ ఇన్షూరెన్స్ ఇండియాలో తొలి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) కోసం హైదరాబాద్ను ఎంపిక చేసుకుంది. కెనడియ న్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (సీఐబీసీ) తమ తొలి భారతీయ జీసీసీని స్థాపించనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ను గ్లోబల్ ఇంజినీరింగ్-సైబర్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పేర్కొంది. మాక్సిమస్ (అమెరికా) గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ-ఆపరేషన్స్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటుచేయనున్నారు. జీఎంఆర్ స్పోర్ట్స్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేయనున్నారు. అనలాగ్ ఏఐ (అలెక్స్ కిప్మాన్) హైదరాబాద్లో గ్లోబల్ పరిశోధన-ప్రోటో టైపింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
ఆల్ట్ మిన్ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రం ప్రతిపాదించారు. అజ య్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోలో స్టూడియోలు, వీఎఫ్ ఎక్స్, వర్క్ షాప్లు వంటి ఫిల్మ్ ఎకో సిస్టంను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. తెలంగాణ-యూఏఈ-ఆఫ్రికా పెట్టుబడి భాగస్వామ్యాల కోసం చర్చించారు. బహుళరంగ పెట్టుబడి డెస్క్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకునేందుకు పరిశీలించారు.
బ్లాక్స్టోన్ ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్ ల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. సత్త గ్రూప్ సమగ్ర టౌన్షిప్ ప్రతిపాదనపై చర్చ. ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్పై ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. సుమధుర గ్రూప్ కొత్త టౌన్షిప్, మధ్య తరగతి నివాస సముదాయాలను ప్రతిపాదించారు. విజ్జీ హోల్డిం గ్స్ మల్టీ-ఒమిక్స్, డిజిటల్ ట్విన్, ప్రిసిషన్ హెల్త్ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదించారు.