2 July, 2026 | 4:05 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

రెడ్లకుంటలో సాగునీటి కాలువ పునరుద్ధరణ పనుల ప్రారంభం

13-05-2026 08:43 PM

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ పట్ల రైతుల హర్షం

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలం, రెడ్లకుంట గ్రామంలోని ఎస్సీ మాన్యాల రైతులకు సాగునీటి కష్టాల నుండి విముక్తి కల్పిస్తూ ఎన్.హెచ్.పి కెనాల్ నుండి సాగునీటి కాలువ పునరుద్ధరణ పనులను సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు బుధవారం ప్రారంభించారు. సర్పంచ్ కుటుంబరావు మాట్లాడుతూ కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక సహకారం, ఓ అండ్ ఎం కమిటీ నిధులతో ఈ పనులను చేపట్టామన్నారు.

రెడ్లకుంట గ్రామ అభివృద్ధిపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, చివరి భూములకు కూడా సాగునీరు అందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయించారన్నారు. ఎస్సీ మాన్యాల కాలువ పూడికతీత, పునరుద్ధరణ పనుల వల్ల ఇక్కడి ఎస్సీ సోదరులైన రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్థులు, రైతులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.