24-06-2025 01:49:20 AM
బీజేఎల్పీ నేత ఏలేటి
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఎన్నికలు ఉన్నపుడే రైతు భరోసానా అని, రైతు భరోసా పథకం ఈ సీజన్కి చివరిదైపోతోందన్న అనుమానం ప్రజల్లో గట్టిగా వినిపిస్తోందని... తర్వాత ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్న చర్చ నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
రైతుల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తే, బీజేపీ కచ్చితంగా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్ధానిక సంస్ధలకు ఎన్నికల నేపథ్యంలో వానాకాలం రైతు భరోసా ఇస్తున్నారని విమర్శించారు. ఓట్లు ఉంటనే రైతు భరోసా ఇస్తారా ... ఈ లెక్కన ఇదే చివరి రైతు భరోసానా అనే అనుమానాలు తలెత్తు తున్నాయని అన్నారు.