08-06-2025 12:00:00 AM
ఇంటికి ఎవరైనా గెస్ట్లు.. బంధువులు.. స్నేహితులు వచ్చినప్పుడు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండిని తయారు చేసుకుంటాం. అందులో కొంత మాత్రమే ఉపయోగిస్తాం. ఆ పిండి మిగిలిపోతే ఏం చేయాలో అర్ధం కాదు. పులిసి పోతుంది. అలా మిగిలిపోయిన పిండితో ఎంతో రుచికరమైన పదార్థాలు చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
ఇడ్లీ పిండి మిగిలిపోతే దాన్ని ఏం చేయాలో అర్ధం కాక పంచి పెడుతుంటారు. అలా పంచి పెట్టకుండా మీరే ఎంచక్కగా టేస్టీ పదార్థాలు తయారు చేసుకోవచ్చు. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో తురిమిన కొబ్బరి కలపండి. ఇడ్లీ పాత్రకు కొద్దిగా నూనె గాని నెయ్యి గాని రాసి చిన్న ఉండలుగగా చేసి వాటిని అందులో ఉంచి ఆవిరిపై ఉడికించండి. రాత్రి వేళలో భోజనానికి బదులు అల్పహారంగా ఇది తింటే తేలిగ్గా అరుగుతుంది.
క్రిస్పీగా మెత్తగా ఉండాలంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో కొబ్బరి తురుము కలిపి తయారు దోసె వేసుకోవచ్చు. ఇంకా మెత్తని ఉప్మా.. వేయించిన స్నాక్స్.. అన్నీ వీటితో తయారు చేసుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా బియ్యం పిండి, బెల్లం, జీలకర్ర, అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మొదలైనవి కలపాలి.
వీటితో పాటుగా కొన్ని క్యారెట్.. క్యాబేజీ లాంటి కూరగాయలు కలపాలి. పాన్ వేడి చేసి కొంచెం పిండి మందంగా పోసి గంటెతో పలుచగా చేయండి. ఆ తర్వాత బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా క్రిస్పీగా వేయించండి. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పెరుగులో నంజుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.