17 April, 2026 | 9:42 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డు జారీ

03-05-2025 07:13 PM

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్...

మంచిర్యాల (విజయక్రాంతి): రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(District Additional Collector Sabavat Motilal) శనివారం తెలిపారు. పెండింగ్ లో ఉన్న నూతన రేషన్ కార్డులు, కార్డులలో సభ్యులను చేర్చడంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులను సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారిని ఎంపిక చేసి జిల్లాలో 956 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

రేషన్ కార్డులలో పిల్లలను చేర్పించుట, ఇతర మార్పులకు సంబంధించి 29 వేల 237 దరఖాస్తులు విచారించి ఆమోదించడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మీ-సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారుల ఎంపికకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.