11-08-2025 12:00:00 AM
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ ఆగస్టు 10 : మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సాంస్కృత అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. ఆదివారం కోదాడ కిట్స్ కళాశాలలో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు గుండె పంగు రమేష్ ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టిన రోజును పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి పాటల పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
కళాకారులకు కళ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపుని ఇస్తుందని వారి కొరకు ఎటు వంటి అవసరం ఉన్నా గాని వారికి అండగా నిలబడుతుం దన్నారు. కళాకారులని గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వెలికి తీయాలని వారి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వాళ్ళలో దాగి ఉన్నటువంటి కళను బయటకు తీసుకురావాలని ప్రతి .
ఈ క్రమం లో ప్రముఖ వాగ్గేయకారులు సినీ గేయ రచయిత మాస్టర్జి , సినీ మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ వీరుతోపాటు గాలి శ్రీనివాస్ నాయుడు, బాదే రాము, బలుగూరి స్నేహ, డాక్టర్.నందిపాటి శ్రీ ప్రియ, మాతంగి శైలజ, ఫ్లూ న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు కార్యక్రమంలో విశిష్ట అతిథిగా అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మీలా సత్యనారాయణ ,టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి , సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు , తెర సాంస్కృతిక మండలి అధ్యక్షులు వేముల.
వెంకటేశ్వర్లు, తెర సాంస్కృతిక మండలి అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు ఎంఈఎఫ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, నందిపాటి సైదులు, షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఏర్పుల తీరూప్,ఇరుగు కిరణ్, ఓరుగంటి పాండు, అబ్బి మల్ల రవి, రామ్ చరణ్ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కుడుముల శివ, ఉడుముల ప్రశాంత్ కుడుముల రాంబాబు గుండెపంగు రవి, రజిని, యేసు, మరియు గాయని గాయకులు తదితరులు పాల్గొన్నారు...