సీఎం పర్యటనను అడ్డుకుంటాం
ట్రయల్ రన్ కోసం ముఖ్యమంత్రి రావడం హాస్యాస్పదం
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జనవరి 13 (విజయక్రాంతి) : అన్ని వర్గాలకు మోసపూరిత హామీతో పాటు, రైతులకు రైతుబంధు ఎగగొట్టడమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వ కల్పించిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న చేపట్టే ఆదిలాబాద్ పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. మంగళవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డికి రైతుల బాధలు పట్టవు కానీ, ఎన్నికలు రాగానే కానుకలు గుర్తుకు వస్తున్నాయన్నారు.
గడచిన రెండు సంవత్సరాల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదు, కానీ చనాక కొరట బ్యారేజ్ ట్రయల్ రన్ పేరుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన చేయడం రైతులు గమనిస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తేనే రైతుబంధు వేస్తున్నారు తప్ప, రైతులకు కావాల్సిన యూరియా రైతుబంధు, కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతుందన్నారు. ఎన్నికల కోసం చనాక కోరాట ప్రాజెక్టు ట్రయల్ రన్ కోసం సీఎం రావడం హాస్యస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసం నర్సింగరావు, గండ్రత్ రమేష్, మెట్టు ప్రహ్లాద్, సతీష్, బుట్టి శివ, తిరుపతి, పాశం రాఘవేంద్ర, మహేష్, సదుల్ల, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.




