బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన
13-01-2026 10:18 AM
రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన యువ నాయకులు చింతల్ సుభాష్ తెలిపారు. రాష్ట్ర నాయకుల ఆదేశాలు ప్రకారం తను పోటీ చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, కార్యదర్శి రామ్ తల్లూరి ఆధ్వర్యంలో పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉంటానని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఒక అవకాశం ఇవ్వండి అన్ని రకాల సమస్యలు పరిస్తారని తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.




