29-01-2026 05:03:41 PM
తాండూరు, 29 జనవరి,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జుంటుపల్లి వెంకట్ గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు. మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వార్డు, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.