16 April, 2026 | 6:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

వెంకటరమణారెడ్డికి బ్రిక్స్ యూనియన్ సంతాపం

25-06-2025 06:57 PM

అశ్వాపురం (విజయక్రాంతి): మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఇటుక బట్టీల వ్యాపారి సురకంటి వెంకటరమణారెడ్డి ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందగా, ఇటుక బట్టీల వ్యాపారస్తులు బుధవారం బ్రిక్స్ యూనియన్ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని, సేవా భావాన్ని, ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకొని పలువురు ఆయన సేవలను కొనియాడారు. ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇటుక బట్టీల యూనియన్ అధ్యక్షులు మర్రి మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షులు తలపనేని కొండలరావు, యూనియన్ సభ్యులు ఆగిటి రవీందర్ రెడ్డి, గుర్రం రవి, బద్దం వెంకటరెడ్డి, ముద్దం సైదిరెడ్డి, సాదినేని నాగేశ్వరరావు, వడ్డేం పూడి రాము, చిగురుపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.