21-06-2025 02:41:51 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహ (Prof. Jayashankar Statue)ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించగా, వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, నలంద విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించిన వారిలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రథముడని, తన యొక్క రచనల ద్వారా భావ వ్యాప్తిని తెలంగాణ ప్రజలలో రగిలించి ఉద్యమ తీవ్రతను పెంచడంలో సఫలీకృతుడయ్యాడని కొనియాడారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకులు జయశంకర్ సార్ సిద్ధాంతాలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో రాబోయే తరం జయశంకర్ సార్ రచనలను, వారి సిద్ధాంతాలను గుర్తుపెట్టుకోవాలని, ఆచరించాలని పిలుపునిచ్చారు. విగ్రహ ప్రతిష్టాపన ప్రాంతాన్ని జయశంకర్ జంక్షన్ గా నామకరణం చేశారు. ప్రజలందరూ ఇకనుంచి ఈ ప్రాంతాన్ని జయశంకర్ సార్ జంక్షన్ గా పిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి , మాజీ వైస్ ఛైర్మెన్ మార్నేని వెంకన్న, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ నెహ్రు నాయక్, వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణువర్ధన్ , సలహాదారులు మైస నాగయ్య, టిపిజెఎసి నాయకుడు మైస శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ ఫరీద్, వహీద్, శంతన్ రామరాజు, ఆరుద్ర పరమాత్మ చారి, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం, జిల్లా అధ్యక్షులు బలాస్తీ రమేష్, రాచకొండ ఉపేందర్ పి.ఆర్.టియు నాయకుడు హల్యనాయక్ ,డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవేందర్ రాజు, ఎంఆర్పిఎస్ నాయకుడు సోమారపు వీరస్వామి, బాలికల కళాశాల ప్రిన్సిపల్ పొక్కుల సదానందం, వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కూరాకుల భారతి, పిట్టల రాము, కోటా సుధాకర్ ,పెద్ది వెంకన్న , సైదులు రెడ్డి, నట్టె రవి, దుగ్గి గోపాల్ , జానీ , వెంకట్ నాయక్ గోనే శ్యామ్ రావు , పెండ్లి అశోక్, వి.శ్రీనివాస్, మద్దెర్ల రాజన్న , మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.