ఆర్చర్ పునరాగమనం

01-05-2024 01:23:22 AM

లండన్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌నకు మంగళవారం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును జాస్ బట్లర్ నడిపించనున్నాడు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఏడాది విరామం తర్వాత మెగాటోర్నీ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లంతా జట్టులో చోటు దక్కించుకున్నారు. 

జట్టు: బట్లర్ ( కెప్టెన్), అలీ, ఆర్చర్, బెయిర్ స్టో, బ్రూక్, సామ్ కరన్, డకెట్, హార్ట్‌లీ, జాక్స్, జోర్డాన్, లివింగ్‌స్టోన్, రషీద్, సాల్ట్, టాప్లీ, వుడ్.