హనుమకొండ/ఖమ్మం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పరకాల, నడికుడ మండలా లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్లో చేరారు. హనుమకొండ భవానీ నగర్లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో పర్నెతి తిరుపతిరెడ్డి, బొల్లె భిక్షపతి, పెండ్యాల విక్రమ్రెడి, దార్న చంద్రమౌళి, అల్లె సంతోష్, చిగురుమామిడి రాజ్ కుమార్, చెల్లుమల్ల ప్రశాంత్రెడ్డి, పంజాల సారంగపాణి, బొజ్జం రమేష్,రజిత, రవీందర్, బయ్య రాజేందర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే మొలుగూరి భిక్షపతి, పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొన్నారు.