9 May, 2026 | 2:19 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

బీజేపీలో పలువురి చేరిక

16-08-2024 01:46 AM

కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

రాజేంద్రనగర్, ఆగస్టు 15: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత బొక్క బాల్‌రెడ్డి సమక్షంలో నార్సింగి మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారి కి పార్టీ కండు వా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నార్సింగి మున్సిపాలిటీలో పాగా వేస్తామన్నారు. బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరు గుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు పతి జైదీప్‌రాజ్, కవిరాజ్, విజయవర్దన్, మునక సురేశ్‌కుమార్, క్రాంతికుమార్, నవీన్‌కుమార్, రామ్‌పవన్, ఉదయ్‌చారి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.