21-05-2025 12:37:16 AM
యూనియన్ నేతలు గణేష్, సురేష్, చంద్రశేఖర్
రాజేంద్రనగర్, మే 20: ఐక్య పోరాటాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని, జర్నలిస్టులు పోరాడి హక్కు లు సాధించుకోవాలని టిడబ్ల్యూజేఎఫ్ రం గారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. సత్యనారాయణ, సైదులు పేర్కొన్నారు. మంగళ వారం శంషాబాద్ లోని పద్మావతి గార్డెన్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ విస్తృత స్థాయి సమావేశం నేషనల్ కమిటీ సభ్యులు బి. దేవేందర్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు జిల్లా యూనియన్ సీనియర్ నాయకులు గణేష్ , సురేష్ కుమార్, చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. అంతకు ముం దు.. ఈనెల 12న మరణించిన ఐఎఫ్ డబ్ల్యూ జే జాతీయ అధ్యక్షుడు విక్రమ్ రావుకు నివాళులు అర్పించారు. అనంతరం టీడబ్ల్యూ జేఎఫ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శు లు సత్యనారాయణ, సైదులు మాట్లాడు తూ.. గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప జర్నలిస్టుల పరిస్థితి మారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. హక్కు లు సాదించుకోవడం కోసం యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాలని సూచించారు.
సీనియర్ నాయకులు గణేష్, సురేష్, చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మరింత బలోపేతంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లా నూతన కమిటీ సభ్యులుగా బి. దేవేందర్, కే. సుదర్శన్ గౌడ్, ఎం. శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ యూనియన్ నాయకులు నర్సింహా రెడ్డి , సీనియర్ జర్నలిస్టులు పి. విక్రమ్ కుమార్ , జాన్, విజయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
రాజేంద్రనగర్ నియోజకవర్గం టీడబ్ల్యూ జేఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఏ. గోపాల్ , ఇలిటం బుచ్చన్న , ఉపాధ్యక్షులుగా ఇ.ప్రభాకర్, పీ. నర్సింహ యాదవ్, పీ. మా ధవ చారి, కోశాధికారిగా ఏ. భానుమూర్తి, సహాయ కార్యదర్శులుగా కె. సతీష్ బాబు, పీ. యాదగిరి, మద్దూర్ శ్రీనివాస్, సలహాదారు కోళ్ల యాదయ్య, ప్రచార కార్యదర్శిగా ఆర్. జ్ఞానేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.