calender_icon.png 3 February, 2026 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి పాత్రికేయులు దిక్సూచిగా నిలవాలి

03-02-2026 01:20:26 AM

మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్

మేడిపల్లి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సమాజం లో జరిగే మంచి చెడులను ప్రపంచా నికి చూపించే పాత్రికేయులు దిక్సూచిలా నిలవా లని మేడిపల్లి ఏసీపీ మోహ న్‌కుమార్ అన్నారు. సోమవారం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మేడిపల్లి శాఖ ప్రతినిధులు ఏసీపీ మోహన్ కుమార్‌ను కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు నిక్కచ్చిగా వార్తలు రాయాలని, సమాజంలో జరుగుతు న్న అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యుజె ఐ అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకన్న, భాను కుమార్, నందీష్, కృష్ణ, బివి రాజు, భాస్కర్ పాల్గొన్నారు.