హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుంది. ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో మన్నె క్రిశాంక్ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రిశాంక్ చంచల్గూడ జైలులో ఉన్నారు. క్రిశాంక్ తరఫు లాయర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్కు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో సాక్ష్యాధారాలు, సాక్షులను తారుమారు చేసే అవకాశమున్నదని, బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై చర్చ అనంతరం కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.